- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 1547వ రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో స్టీల్ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) నాయకులు, ఉక్కు ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ… ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలన్నారు. పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులను అకారణంగా తొలగించడం సరికాదన్నారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని, నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లోనూ దేశాన్ని ముందుకు నడిపించాల్సిన కేంద్రంలోని మోడీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి దేశాన్ని వెనక్కి నెడుతోందని విమర్శించారు.