ప్రజాశక్తి-అమరావతి : వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుంచి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీలకు ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 13 నుంచి మే నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకల సమయాలను రైల్వే శాఖ త్వరలో వెల్లడించనుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
విశాఖపట్నం-బెంగళూరు ప్రత్యేక రైళ్లు (14 ట్రిప్పులు)
- రైలు నెంబర్ 08581 విశాఖపట్నం నుంచి ప్రతి ఆదివారం బయలుదేరుతుంది.
- తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 08582 బెంగళూరు నుంచి ప్రతి సోమవారం బయలుదేరుతుంది.
- ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట,
- జోలార్పేట, కుప్పం, బంగారుపేట, కష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది.
- 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్లు అందుబాటులో ఉంటాయి.
విశాఖపట్నం-తిరుపతి ప్రత్యేక రైళ్లు (14 ట్రిప్పులు)
- రైలు నెంబర్ 08547 విశాఖపట్నం నుంచి ప్రతి బుధవారం బయలుదేరుతుంది.
- తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 08548 తిరుపతి నుంచి ప్రతి గురువారం బయలుదేరుతుంది.
- ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు,
- గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
- 2ఏసీ, 3ఏసీ, జనరల్ కోచ్లు ఉంటాయి.
విశాఖపట్నం-కర్నూలు సిటీ ప్రత్యేక రైళ్లు (14 ట్రిప్పులు)
- రైలు నెంబర్ 08545 ప్రతి మంగళవారం విశాఖపట్నం నుంచి కర్నూలు సిటీకి బయలుదేరుతుంది.
- తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్ 08546 బుధవారం నాడు కర్నూలు సిటీ నుంచి బయలుదేరుతుంది.
- ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, డోన్ స్టేషన్లలో ఆగుతుంది.
2ఏసీ, 3ఏసీ, జనరల్ కోచ్లు ఉంటాయి.