మాజీ మంత్రి ఫరూక్‌కు తప్పిన ప్రమాదం

  •  గేదెల మందను ఢీ కొట్టిన కారు
  •  ఎయిర్‌ బెలూన్‌ ఓపెన్‌ కావడంతో స్వల్ప గాయాలు

ప్రజాశక్తి – పాణ్యం/నంద్యాల కలెక్టరేట్‌ : నంద్యాల శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ మంత్రి ఎన్‌ఎండి.ఫరూక్‌కు పెను ప్రమాదం తప్పింది. గోదెల మందను ఆయన వాహనం ఢీ కొన్నడంతో గాజు ముక్కలు తగిలి స్వల్ప గాయాలయ్యాయి. ఫరూక్‌ అనుచరుల కథనం ప్రకారం… నంద్యాల నుంచి కర్నూలుకు మంగళవారం ఫరూక్‌ కారులో బయలుదేరారు. మార్గమధ్యంలో పాణ్యం మండలం తమ్మరాజుపల్లె వద్ద రోడ్డు దాటుతున్న గేదెల మందను కారు ఢీ కొట్టింది. ఎయిర్‌బెలూన్‌ ఓపెన్‌ కావడంతో పెనుప్రమాదం తప్పింది. కారు ముందు అద్దాలు పగిలి గాజు ముక్కలు గుచ్చుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 108 సిబ్బంది ప్రథమ చికిత్స అనంతరం నంద్యాల ప్రయివేట్‌ ఇంటెన్స్‌వ్‌ ట్రామా కేర్‌కు తరలించారు. డ్రైవర్‌ గౌస్‌తో పాటు ఆ కారులోని మరో ఇద్దరికి ఎలాంటి గాయాలూ కాలేదు. చికిత్స పొందుతున్న ఎన్‌ఎండి ఫరూఖ్‌ను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, నంద్యాల ఎంపి అభ్యర్థి బైరెడ్డి శబరి, పాణ్యం టిడిపి అభ్యర్థి గౌరుచరితారెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమాబ్రహ్మానందరెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తదితరులు పరామర్శించారు.

➡️