- పొగాకు రైతులను ఆదుకోవాలని ఎపి రైతు సంఘం ధర్నా
- అడ్డుకున్న పోలీసులు
ప్రజాశక్తి-కర్నూలు కలెక్టరేట్ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట పొగాకు రైతులు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఎపి రైతు సంఘం తీసుకువచ్చిన బ్యానర్ను, పొగాకు బేళ్లను బలవంతంగా లాక్కున్నారు. పోలీసులు దౌర్జంగా వ్యవహరించడంతో సంఘం నేతలు, రైతులు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయటానికి పోలీసులు ప్రయత్నించగా ప్రతిఘటించారు. దీంతో సంఘం నాయకులు మధుసూదన్తోపాలు పలువురు నేతలను బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అడ్డుకోవడం ఏమిటని రైతు సంఘం నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పొగాకు రైతులను ఆదుకోవాలని నిరసన తెలుపుతున్న రైతులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీంతో అరెస్టు చేసిన వారిని పోలీసులు విడుదల చేశారు. రైతు సంఘం బ్యానర్ తిరిగి ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ మాట్లాడుతూ.. రైతులను మోసం చేసి పొగాకు కొనకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకొవాలని, రైతుల నుంచి పొగాకును పూర్తిగా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించుకోవాలని వచ్చిన రైతులను, రైతు సంఘం నేతలను దౌర్జన్యంగా అరెస్టు చేయడాన్ని ఖండించారు.