తెలంగాణ : తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబరు 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన సంగతి విదితమే. తాజాగా అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్స్ జాబితా, ఫైనల్ ‘కీ’ని టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో విడుదల చేశారు.
ఫలితాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయగలరు.. https://www.tspsc.gov.in
ఈ పరీక్ష కోసం 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, దాదాపు సగం మంది మాత్రమే హాజరయ్యారు. గ్రూప్-2 టాపర్కు అత్యధికంగా 447 మార్కులు వచ్చినట్లు కమిషన్ తెలిపింది. మార్కులతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్స్ను కూడా వెబ్ సైట్ లో కమిషన్ అందుబాటులో ఉంచింది. ఇక గ్రూప్ 2 ఫైనల్ ఆన్సర్ కీతో పాటు టాపర్స్ లిస్ట్ను కూడా టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీపీఎస్సీ 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సంబంధించి గత ఏడాది డిసెంబరు 15, 16 తేదీల్లో 368 కేంద్రాల్లో రాత పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ప్రాథమిక ఆన్సర్ ‘కీ’ని టీజీపీఎస్సీ ఈ ఏడాది జనవరి నెలలో 17వ తేదీన విడుదల చేసింది. ఆన్సర్ కీ అభ్యంతరాలను జనవరి 22 వరకు స్వీకరించింది. ఇక తుది ఆన్సర్ కీ రూపొందించిన కమిషన్ తాజాగా ఫలితాలను విడుదల చేసింది. గ్రూప్ 2 పరీక్షలను మొత్తం 4 పేపర్లకు రెండు రోజుల పాటు జరిగాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది దరఖాస్తు చేసుకుంటే పరీక్షకు మాత్రం కేవలం 45.57 శాతమే హాజరయ్యారు. అంటే దాదాపు రెండున్నర లక్షల మంది మాత్రమే అభ్యర్ధులు పరీక్ష రాశారు. అప్పటి నుండి అభ్యర్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. నేడు ఆ ఫలితాలు రిలీజ్ అయ్యాయి.