అరుణాచల గిరి ప్రదక్షిణకు టీజీఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ

Jul 14,2024 14:02 #packages, #tgrtc

హైదరాబాద్‌: తమిళనాడులోని అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణకు వెళ్లాలనుకునే యాత్రికులకు తెలంగాణ ఆర్టీసీ (టీజీఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ప్రత్యేక బస్సులతో ప్యాకేజీని ప్రకటించినట్లు టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌ (ట్విటర్‌)లో ఆయన పోస్ట్‌ చేశారు.
ఈనెల 21న గురు పౌర్ణమి సందర్భంగా అరుణాచలం వెళ్లే యాత్రికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 19 నుంచి 22వ తేదీల వరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్గండ, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ తదితర పట్టణాల నుంచి అందుబాటులో ఉండనున్నాయి. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీ బుకింగ్‌ కోసం ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్‌ http://tsrtconline.inను సందర్శించాలని సజ్జనార్‌ సూచించారు. ఈ ప్యాకేజీలో కాణిపాక వరసిద్ది వినాయక స్వామితో పాటు శ్రీపురంలోని గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

➡️