వెంకటగిరి రూరల్ (తిరుపతి) : తిరుపతి జిల్లాలోని బాలాయపల్లి మండలం జయంపు సమీపంలో శనివారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడూరు వైపు వెళ్లే రైలుకు గేదెలు అడ్డురావడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కొన్ని గేదెలు మృతి చెందాయి. దీంతో గంటన్నరపాటు గూడ్స్ రైలు అక్కడే నిలిచిపోయింది. రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టడంతో తిరిగి రైలు బయలుదేరింది.
