రేపు 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం

విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న 41 డిగ్రీల నుంచి 43.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఆ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం తీవ్ర వడగాడ్పులు వీచే మండలాల్లో అల్లూరి సీతారామరాజు 11, అనకాపల్లిలో 8 మండలాలు ఉన్నాయి. వడగాడ్పులు వీచే మండలాల్లో అల్లూరి సీతారామరాజు 8, అనకాపల్లి 16, అనంతపురం 4, అన్నమయ్య 1, చిత్తూరు జిల్లా కుప్పం మండలాలు ఉన్నాయి. శనివారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.7 డిగ్రీలు, విజయనగరంలో 41.1, తూర్పుగోదావరి జిల్లా మురమండలో 41, అన్నమయ్య జిల్లా కంబాలకుంటలో 40.8, వైఎస్‌ఆర్‌ జిల్లా మద్దూరు, ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో 40.7 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు.

➡️