అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

Dec 12,2023 11:39 #Acident, #RTC BUS, #Telangana

 ప్రజాశక్తి-హనుమకొండ : అదుపుతప్పిన ఓ ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఘటన మంగళవారం ఉదయం హనుమకొండ జిల్లా ఓగులపూర్‌ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని స్థానికులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై వరంగల్‌ 2 డిపో మేనేజర్‌ సురేష్‌ మాట్లాడుతూ..వరంగల్‌ 2 డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండ నుంచి ఏటూరు నాగారం వెళుతోంది. ఈ క్రమంలో ఓగులపూర్‌ వద్ద డ్రైవర్‌కి ఒళ్లు తిప్పడంతో సడన్‌ బ్రేక్‌ వేయగా.. బస్సు పొలాల్లోకి వెళ్లిందన్నారు. ఓవర్‌ లోడింగ్‌తో పాటు ఫుట్‌ బోర్డులో కూడా ప్రయాణికులు ఉండడం వల్ల ప్రమాదం జరిగిందని డ్రైవర్‌ చెప్పారని పేర్కొన్నారు. ఈ సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.

➡️