బాధిత మహిళలపై ట్రోల్స్‌ చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలి : ఐద్వా

May 9,2025 21:47 #AIDWA AP, #Fake News, #terror attack

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : బాధిత మహిళలు, లౌకిక విలువలు, ప్రజల ఐక్యత కోసం మాట్లాడే మహిళలగురించి అశ్లీలంగా వ్యాఖ్యానిస్తూ సోషల్‌ మీడియా లో ట్రోల్స్‌ చేసున్న వారిని కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రభావతి, డి.రమాదేవిలు ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రోలింగ్‌లో పాల్గన్న వ్యక్తులను గుర్తించి వారిపై బిఎన్‌ఎస్‌ సమాచారసాంకేతిక చట్టం, ఇతర సంబంధిత చట్టాల కింద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పహల్గామ్‌ ఉగ్రదాడిలో తన భర్త, నేవి అధికారి లెప్టినెంట్‌ వినయ్ నర్వాల్‌ను కోల్పోయిన హిమాన్షీనర్వాల్‌కు, తండ్రిని కోల్పోయిన ఆరతికి తమ పూర్తి సంఘీభావాన్ని, మద్దతును ఐద్వా రాష్ట్రకమిటీ ప్రకటిస్తుందన్నారు. పహల్గామ్‌ ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

➡️