కొడంగల్ (వికారాబాద్) : బొలెరో వాహనం, కారు ఢీకొట్టుకోవడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. కొడంగల్ మండలం ఐనన్పల్లి వద్ద బొలేరో వాహనం, కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
