ములుగు : వాజేడులో మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి చెందారు. తెలంగాణలోని ములుగు జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేలినట్లు తెలిసింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతిచెందగా పలువురికి గాయాలు అయినట్లు సమాచారం. బుధవారం తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో భద్రతా బలగాలు 22 మంది మావోయిస్టులను కాల్చి చంపాయి. ఈ క్రమంలో గురువారం రోజువారీ కూంబింగ్ కోసం వెళ్లిన సమయంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం.
