ఆధ్యాత్మిక యాత్రకు వెళుతూ అనంత లోకాలకు…

  • ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌.. మృతుల్లో అనంతపురం ఎంపీ సోదరి

ప్రజాశక్తి హిందూపురం : ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది. వీరిలో ఇద్దరు ఏపీ వాసులు ఉన్నారు. మరొకరు గాయపడ్డారు. అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి వేదవతితో పాటు విజయారెడ్డి అనే మహిళ ఈ ప్రమాదంలో మృతిచెందినట్లు అధికారులు నిర్ధరించారు. వేదవతి భర్త భాస్కర్‌ గాయాలతో బయటపడ్డారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం రుషికేశ్‌ ఎయిమ్స్‌కు తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రుషికేష్‌ కు బయలుదేరినట్లు సమాచారం.

➡️