ప్రజాశక్తి – తిరుపతి డెస్క్ : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల కోటాను శనివారం టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ 19 ఉదయం 10 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన యాత్రికులు ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి. 22న ఆర్జిత సేవా టికెట్లను, 23న అంగప్రదక్షిణం టోకెన్లును, శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటాను, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటాను, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది.
