హోలీ వేడుకల్లో విషాదం – నీళ్ల ట్యాంకు కూలి చిన్నారి మృతి

నారాయణపేట (తెలంగాణ) : నారాయణపేటలోని హోలీ వేడుకల్లో విషాదం జరిగింది. పట్టణంలోని గోపాల్‌ పేట వీధిలో ఉన్న ఓ మంచినీటి ట్యాంకు వద్ద చిన్నారులు హోలీ ఆడుకుంటుండగా అకస్మాత్తుగా నీళ్ల ట్యాంకు కూలిపోయింది. దీంతో ట్యాంకు సిమెంట్‌ ముక్కలు చిన్నారులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వచ్చి వారందరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రణీత (12) అనే చిన్నారి మఅతి చెందింది. ప్రణీత అనే చిన్నారికి చేయి విరగ్గా, హరిప్రియకు కాలు విరిగింది. స్థానికులు ప్రమాదానికి కారణమైన ట్యాంకును పూర్తిగా తొలగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️