అశ్వారావుపేట: అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను సూసైడ్ కేసులో ఎట్టకేలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను సూసైడ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కానిస్టేబుల్ లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, చనిపోయే ముందు ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఇచ్చిన మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఆంధ్రకు నలుగురు కానిస్టేబుల్స్ సన్యాసి నాయుడు, శేఖర్, సుభాని, శివ నాగరాజు సహా సీఐ వేదింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీరాముల శ్రీనివాస్ చెప్పాడు. దానికి తగ్గట్టుగానే.. అధికారులు చర్యలు తీసుకున్నారు.
