మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై ఘటన
నలుగురికి గాయాలు
ప్రజాశక్తి-గూడూరు : మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి గూడూరు మండలం తరకటూరు గ్రామం వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మచిలీపట్నం రైల్వే స్టేషన్ వద్ద గల శుభం కల్యాణ మండపంలో జరగనున్న ఆశా వర్కర్ల సదస్సుకు హాజరవ్వటానికి వస్తున్న ఆటో తరకటూరు గ్రామం కీయా కారు ఢీ కొట్టడంతో సంఘటనా స్థలంలో ఇద్దరు మృతి చెందగా, నలుగురికీ తీవ్ర గయాలపాలయ్యారు. తాడేపల్లి విజయలక్ష్మి( 45) గోపునేనిపాలెం పమిడిముక్కల మండలం, ఊటుకూరి దుర్గ (40) కపిలేశ్వరం పి.హెచ్.సి తాడంకి గ్రామం ఇద్దరు ఘటనా స్థలం వద్ద మృతి చెందారు. వాణి తాడంకి గ్రామం, గుండె నాగమల్లేశ్వరి మర్రివాడ గ్రామం, గుండె నిర్మల జ్యోతి మర్రివాడ గ్రామం, మాగంటి సుజాత తాడంకి గ్రామంకు చెందినవారు. చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన గూడూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
