పిడుగుపాటుకు ఇద్దరు దుర్మరణం

ప్రజాశక్తి-శ్రీకాళహస్తి (తిరుపతి జిల్లా) : పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందిన సంఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్‌ సిఐ రవినాయక్‌ తెలిపిన మేరకు వివరాల ప్రకారం.. ఊరందూరు ఎస్‌టి కాలనీకి చెందిన జె.మురళి (39), ఆయన సమీప బంధువు ఎన్‌.శంకర్‌ (36) గ్రామ శివారులోని పొలానికి వెళ్లి వస్తుండగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. అదే సమయంలో పిడుగు పడడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, వీరిద్దరు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో వారికోసం గాలించగా పంటపొలాలలో మృతి చెంది పడి ఉన్నారు. మృతుల కుటుంబ సభ్యులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️