- పరిశ్రమలశాఖ మంత్రి టిజి భరత్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రూ.100 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు వెర్మీరియన్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి టిజి భరత్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం మంగళగిరి ఎపిఐఐసి ప్రధాన కార్యాలయంలో మంత్రి భరత్తో వెర్మీరియన్ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. శ్రీసిటీలోని వెర్మీరియన్ కంపెనీ యూనిట్ను విస్తరించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపారు. త్వరలోనే శ్రీసిటీలోని కంపెనీని విస్తరించేందుకు పనులు ప్రారంభిస్తారని మంత్రి భరత్ తెలిపారు. తమ ప్రభుత్వంపై నమ్మకంతో పెట్టుబడిదారులు రాష్ట్రానికి తరలి వస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రితో చర్చల్లో పాల్గొన్న వారిలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టరు సయ్యద్ రియాజ్ ఖాద్రి ఉన్నారు.