ప్రజాశక్తి-అమరావతి : కోర్టు ధిక్కార కేసులో రాజమహేంద్రవరం మున్సిపల్ అధికారులకు హైకోర్టు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. కేసులో నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులపై స్పందించకపోవడం కనీసం న్యాయవాదిని నియమించకపోవడంతో అప్పటి రాజ మహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ డి దినేష్ కుమార్, సిటీ ప్లానర్ జివిఎస్ఎన్ మూర్తి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ టిఎస్ అనితకు బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 18కి వాయిదా వేస్తూ జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏ విధమైన పరిహారమూ చెల్లించకుండానే తమ స్థలాన్ని స్వాధీనం చేసుకు న్నారంటూ కె.బల రామకృష్ణ సహా ఐదుగురు 2022లో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లకు 8 వారాల్లో టిడిఆర్ బాండ్ ఇవ్వాలని మున్సిపల్ అధికారులను 2023లో హైకోర్టు ఆదేశించింది. ఆ ఉత్తర్వులు అమలు కాలేదంటూ కె పూర్ణ గంగా భవాని గతేడాది హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా విచారణ జరిపిన హైకోర్టు కౌంటర్ దాఖలుచేయాలని దినేష్ కుమార్, మూర్తి, టిఎస్ అనితను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆ తర్వాత కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.
