తిరుమలలో తొక్కిసలాట ఎందుకు? ఏం జరిగింది?

Jan 9,2025 08:37 #temple stampede, #Tirumala

తిరుమల తొక్కిసలాటపై స్థానిక నాయకుడు కందారపు మురళీ విశ్లేషణ…

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం శుక్రవారం (10వ తేది) నుంచి 19వ తేదీ వరకూ పది రోజుల పాటు జరగనున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నాటి దర్శనం కోసం గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి ప్రకటించింది. దీనికోసం తిరుపతిలో ఎనిమిది ప్రాంతాల్లో 94 టోకెన్‌ జారీ కేంద్రాలను టిటిడి ఏర్పాటు చేసింది. దీంతో, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు బుధవారం ఉదయం నుంచే పిల్లాపాపలతో సహా వేచి ఉన్నారు. బైరాగిపట్టెడ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించేందుకు క్యూ లైన్‌ను తెరిచినట్లు చెబుతున్నారు. టోకెన్లు జారీ చేసేందుకు క్యూలైన్లు తెరిచారని భావించిన భక్తులు ఒక్కసారిగా తోసుకురావడంతో తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు. అయితే, విష్ణువాసంలో తొక్కిసలాటకు కారణాలు తెలియరాలేదు. క్యూలైన్ల వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు లేవని భక్తులు చెబుతున్నారు. ఒత్తిడికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేదని సమాచారం.

 

➡️