తెలంగాణ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
