సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఒక్కడు’. ఎం.ఎస్.రాజు నిర్మాత. సుమారు 23 సంవత్సరాల తర్వాత ఆంధ్ర, తెలంగాణతో పాటు భారతదేశవ్యాప్తంగా 4కెలో ఈ సినిమా తెలుగులో విడుదలవుతుంది. రాధా మాధవి ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సమర్పణలో రామకృష్ణ ఈనెల 26న సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. గుణ శేఖర్, మహేష్ బాబు కెరీర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకులందరికీ మరోసారి అలరించేందుకు రానుంది. భూమిక చావ్లా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో తనదైన ముద్ర వేశారు.
Print Edition26న 4కెలో ఒక్కడు రీ రిలీజ్
1 గంట క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 22, 2026, 08:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)