ప్రజాశక్తి-ప్రత్తిపాడు (కాకినాడ): పోలియో మహమ్మారిని తరిమికొట్టాలని ఎమ్మెల్యే వరుపులసత్యప్రభ అన్నారు. ఆదివారం ఉత్తరకంచిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేశారు. పోలియో లాంటి ప్రమాదకర వ్యాధుల నుంచి చిన్నారులు రక్షించేందుకు ఈ కార్యక్రమం కీలకమన్నారు. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఈ కార్యక్రమం ఎంతో దోహా దపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ యశస్వి, ఇళ్ల అప్పారావు, హెల్త్ సూపర్వైజర్ రామిశెట్టి రాంబాబు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోలియో మహమ్మారిని తరిమికొట్టాలి : ఎమ్మెల్యే వరుపులసత్యప్రభ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 28, 2026, 01:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)