సుదీర్ఘకాలం పాత్రికేయుడిగా కొనసాగి 1997లో కన్నడ సినిమా 'ఉల్టా పల్టా' ద్వారా దర్శకుడిగా గుర్తింపు పొందిన ఎన్ఎస్ శంకర్ (67) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకర్ ఆదివారం నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన పలు సినిమాల్లోనూ నటించారు. ప్రముఖ కన్నడ పత్రికలైన ప్రజావాణి, లంకేశ్లలో పనిచేసిన శంకర్ రచయిత గానూ గుర్తింపు పొందారు. దళిత సాహిత్యంలో అనేక రచనలు అందించారు. 2024లో రాజ్యోత్సవ పురస్కారం అందుకున్నారు. శంకర్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
Print Editionకన్నడ దర్శకుడు ఎన్ఎస్ శంకర్ కన్నుమూత
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 29, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)