ప్రజాశక్తి- తిరుమల : తిరుమలలోని ఎస్ఎన్సి షెడ్ పరిధిలో ఉన్న షాప్ నెం.36లో గురువారం ఓ నెమలి కనిపించింది. దీంతో భక్తులు, స్థానికుల్లో ఆసక్తిగా నెమలిని తిలకించారు. ఉదయం దుకాణాన్ని తెరిచిన యజమాని షాపులో నెమలిని గమనించి వెంటనే టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకుని నెమలిని సురక్షితంగా పట్టుకున్నారు. గాయాలేమైనా ఉన్నాయా అని పరిశీలించారు. ఎలాంటి గాయాలు లేకపోవడంతో సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అన్నారు.
దుకాణంలో నెమలి ప్రత్యక్షం
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 25, 2026, 03:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)