ఒంగోలు (ప్రకాశం) : ఒంగోలులో పొగాకు రైతులు కదంతొక్కారు. శుక్రవారం పొగాకు రైతులు చేపట్టిన భారీ ట్రాక్టర్ల ర్యాలీతో నగరం కిటకిటలాడింది. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ .... నగరంలోకి భారీగా పొగాకు రైతులు తరలివచ్చారు.టొబాకో బోర్డు సమీపంలోని మిని స్టేడియం నుంచి ట్రంక్ రోడ్ , కర్నూలు రోడ్ మీదుగా ఫ్లై ఓవర్ బ్రిడ్జి దాకా ట్రాక్టర్ల ర్యాలీ సాగింది. రైతులకు మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా నేతలు నిలిచారు. రైతుల ప్రదర్శన, పొగాకు రైతుల వాహనాలతో నగరమంతా కిక్కిరిసింది.
కదంతొక్కిన పొగాకు రైతులు - కిటకిటలాడిన ఒంగోలు ..!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 19, 2026, 12:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)