న్యూఢిల్లీ : టెలిగ్రామ్ పై తాత్కాలిక నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం సమర్థించింది. అత్యవసర పరిస్థితుల రిత్యా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరిందని, ఐటి చట్టంలోని సెక్షన్ 69A కింద చట్టబద్ధమైన ప్రక్రియను సక్రమంగా అనుసరించారని పేర్కొంది. కేంద్రం విధించిన తాత్కాలిక బ్లాకింగ్ ఉత్తర్వును సవాలు చేస్తూ టెలిగ్రామ్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ప్లాట్ఫారమ్ను బ్లాక్ చేయడానికి ప్రభుత్వం పేర్కొన్న కారణాలు ఆ పరిస్థితులలో సరిపోతాయని జస్టిస్ తేజస్ కరియా వ్యాఖ్యానించారు. ఆ ఉత్తర్వులో విధానపరమైన అవకతవకలు లేదా తగిన కారణాలు లేవన్న టెలిగ్రామ్ వాదనను తిరస్కరించారు. ఈ ఉత్తర్వులు ఆలోచనా రాహిత్యంతో జారీ కాలేదని జస్టిస్ కరియా వ్యాఖ్యానించారు. బ్లాకింగ్ ఉత్తర్వులు అసమానమన్న టెలిగ్రామ్ వాదనను తిరస్కరించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు అతి తక్కువ ఆంక్షలతో కూడుకున్నవని, ఈ ఉత్తర్వు అసమానమైనదని భావించలేమని కోర్టు పేర్కొంది. సెక్షన్ 69A కింద మొత్తం ప్లాట్ఫారమ్ను బ్లాక్ చేయలేరన్న టెలిగ్రామ్ వాదనను కూడా హైకోర్టు తోసిపుచ్చింది. ఆ నిబంధన "సమాచారాన్ని" బ్లాక్ చేయడం గురించి వ్యాఖ్యానిస్తుంది కానీ మధ్యవర్తిని బ్లాక్ చేయడం గురించి కాదని పేర్కొంది.
టెలిగ్రామ్ యాప్ నిషేధాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 19, 2026, 11:46 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)