ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-జి నిరాశపరుస్తున్న ఈజిప్ట్ జట్టు 2వ స్థానంతో ముగించి నాకౌట్కు చేరింది. శనివారం జరిగిన గ్రూప్ లీగ్ చివరి మ్యాచ్లో ఈజిప్టు, ఇరాన్ జట్లు 1-1తో డ్రాతో ముగించాయి. ఇరుజట్లు నాకౌట్ బెర్తు లక్ష్యంగా హోరాహోరీగా తలపడ్డాయి. ఐదో నిమిషంలోనే మహమూద్ సబెర్ గోల్ అందించగా.. ఈజిప్ట్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇరాన్కు పెనాల్టీ లభించినా సద్వినియోగం చేసుకోలేదు. ప్రత్యర్థి డిఫెన్స్ను ఛేదిస్తూ 14వ నిమిషంలో రమిన్ రజీయన్ గోల్తో ఇరాన్ 1-1తో స్కోర్ సమం చేసింది. ఆ తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డారు. 93వ నిమిషంలో ఆట ముగుస్తుందనగా.. ఇరాన్ ప్లేయర్ ఖలిజదేహ్ ఈజిప్ట్ గోల్పోస్ట్లోకి బంతిని పంపాడు. 2-1తో ఆసియా జట్టు గెలిచిందనుకుంటే.. బంతి ఆఫ్ సైడ్ వెళ్లిందని వీడియో అసిస్టెంట్ రిఫరీ గోల్ ఇవ్వలేదు. దాంతో 1-1తో మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఈజిప్ట్ నాకౌట్లో అడుగుపెట్టింది. ఈ గ్రూప్ నుంచి బెల్జియం(5పాయింట్లు) 32వ రౌండ్కు చేరింది. ఇక ఇరాన్ గ్రూప్ దశలో ఆడిన స్పెయిన్, ఉరుగ్వే, ఈజిప్ట్ మూడు మ్యాచ్లను డ్రాగా ముగించి 3 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
అంతకుముందు ఇదే గ్రూప్లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో బెల్జియం జట్టు 5-1గోల్స్ తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. బెల్జియం తరఫున లియాండ్రో టోస్టార్ట్ 28వ ని., 50వ ని.లో రెండు గోల్స్ చేయగా. కెవిన్66వ ని. రొమేలు 86వ ని.లో, అలెక్సిన్ అదనపు సమయం 94వ ని.లో ఒక గోల్ కొట్టాడు.









కామెంట్లు (0)