ప్రజాశక్తి - విజయవాడ : 2025 క్రీడలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్జున అవార్డులకు ఎంపికయిన పుల్లెల గాయత్రి (బ్యాట్మెంటెన్), ధనుష్ శ్రీకాంత్ (పారా షూటింగ్)లకు సిపిఎం రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియజేసింది . ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ధనుష్ శ్రీకాంత్ వినికిడి సమస్య ఉన్నా దానిని లోపంగా భావించకుండా మూడు స్వర్ణ పథకాలు సాధించి క్రీడా రంగంలో ఈ స్థాయికి ఎదిగి, ఎందరో యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పుల్లెల గాయత్రీ - ట్రీషా జాలే జోడిగా అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయాలకు గాను ఈ అవార్డులకు ఎంపికవ్వడం హర్షణీయమన్నారు. ప్రభుత్వాలు నిధులు కేటాయించి గ్రామ స్థాయి నుండి క్రీడా కారులను ప్రోత్సహిస్తే మరెంతమందో ఆణిముత్యాలు లాంటి వారు మరిన్ని విజయాలు సాధిస్తారని ఆకాంక్షించారు .








కామెంట్లు (0)