ప్రజాశక్తి...విజయనగరం టౌన్ : ఉచిత జర్మన్ భాషా శిక్షణా కార్యక్రమం కోసం జూన్ 26న ఆన్లైన్ ఇంటర్వ్యూలు పార్రంభంకానున్నాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జర్మన్ భాషా శిక్షణా కార్యక్రమం కోసం మొత్తం 117 దరఖాస్తులు అందాయని, దరఖాస్తుదారుల విద్యా అర్హతలు మరియు సంబంధిత అనుభవం ఆధారంగా పరిశీలించామని, ఇంటర్వ్యూ కోసం 63 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని అన్నారు.
ప్రకటనలో వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ‘‘టెక్నికల్ రౌండ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ రౌండ్, కమ్యూనికేషన్ స్కిల్స్ అసెస్మెంట్తో కూడిన ఆన్లైన్ ఇంటర్వ్యూలు 26 జూన్ 2026న ప్రారంభమవుతాయి. అభ్యర్థుల సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, శిక్షణా కార్యక్రమానికి వారి మొత్తం అనుకూలతను అంచనా వేయడానికి ఈ ఇంటర్వ్యూ ప్రక్రియ రూపొందించబడింది. ఆన్లైన్ ఇంటర్వ్యూలలో అభ్యర్థులు చూపిన నైపుణ్యం ఆధారంగా, ఉచిత జర్మన్ భాషా శిక్షణా కార్యక్రమంలో పాల్గొనడానికి 30 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా పాల్గొనేవారికి జర్మస్ భాషా ప్రావీణ్యం మరియు సమర్థవంతమైన కమ్యూనికేషస్ నైపుణ్యాలను అందించడం, తద్వారా వారి ఉన్నత విద్య, అంతర్జాతీయ ఉపాధి, వృత్తిపరమైన పురోగతి అవకాశాలను కల్పించడం లక్ష్యం. ఇంటర్వ్యూ ప్రక్రియ కోసం ఎంపికైన అభ్యర్థుల జాబితా జె ఎన్ టి యు వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఎంపికైన అభ్యర్థులు తమ ఇంటర్వ్యూ షెడ్యూల్, ఇతర ముఖ్యమైన సూచనల కోసం జె ఎన్ టి యు వెబ్సైట్ను క్రమం తప్పకుండా సందర్శించాలి. అవసరమైతే, అభ్యర్థులు తమ సర్టిఫికేట్లు, సంబంధిత పత్రాలను ధృవీకరణ కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. మరిన్ని వివరాల కోసం 6302403426 సంప్రదించండి.’’ ఎంపికైన అభ్యర్థులందరికీ ఉప-కులపతి ప్రొఫెసర్ వి.వి. సుబ్బారావు శుభాకాంక్షలు తెలిపారు.









కామెంట్లు (0)