హైదరాబాద్ : హైదరాబాద్లో తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బ్లాక్ టీషర్టులు ధరించి అసెంబ్లీకి వచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు బిఆర్ఎస్ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని నిలువరించారు. దీంతో BRS ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, బిఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో ఎమ్మెల్యే జగదీష్రెడ్డి కాలికి గాయమైనట్లు సమాచారం. మహిళా ఎమ్మెల్యేలను పోలీసులు అవమానించారంటూ బిఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఈ ఘటన అనంతరం నల్ల టీషర్టులతో అసెంబ్లీ లోపలికి అనుమతించకపోవడంతో హరీశ్రావు టీషర్ట్ విప్పి బనియన్తో నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 09:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)