ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్https://resultsbie.ap.gov.inలో కూడా చూసుకోవచ్చు. వీటితోphone లోనే సులభంగా ఫలితాలను పొందేందుకు 'మనమిత్ర' వాట్సప్ నంబరు 9552300009 కు మెసేజ్ చేయడం ద్వారా కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. కాగా, ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ రెండో ఏడాది (సెకండియర్) విద్యార్థులకు కూడా మార్కులు మెరుగుపరుచుకునేందుకు వీలుగా 'ఇంప్రూవ్మెంట్' రాసుకునే ప్రత్యేక సదుపాయాన్ని కల్పించినట్లు బోర్డు స్పష్టం చేసింది.
నేడు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
1 రోజు క్రితం
వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 18, 2026, 09:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)