అమరావతి : ఎపి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. మొత్తం 94,990 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కాగా.. వారిలో 78,261 మంది విజయవంతంగా ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది పాస్ పర్సంటేజ్ 76.14 శాతంగా ఉండగా.. ఈసారి అది ఏకంగా 6.25 శాతం పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటానికి, విద్యార్థుల కష్టానికి ఈ ఫలితాలే నిదర్శనమని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్సైట్ ద్వారా సులభంగా చూసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రత్యేక లింకులను సిద్ధం చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ సాయంతో ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి ...
మొదట అధికారిక వెబ్సైట్ https://results.bse.ap.gov.in/ ను సందర్శించాలి.
హోమ్ పేజీలో కనిపించే 'AP SSC Advanced Supplementary Results' లింక్పై క్లిక్ చేయాలి.
మీ పదో తరగతి సప్లిమెంటరీ హాల్ టికెట్ నంబర్ను అక్కడ నమోదు చేయాలి.
సబ్మిట్ బటన్పై క్లిక్ చేయగానే మీ మార్కుల వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
భవిష్యత్తు అవసరాల కోసం ఆ మార్కుల జాబితాను ప్రింట్ అవుట్ లేదా పిడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకోవడం మంచిది.
వాట్సాప్ లో ఎపి టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు ....
మీ మొబైల్లో 95523 00009 నంబర్ను సేవ్ చేయండి.
వాట్సాప్లో ఈ నంబర్కు "Hi" అని మెసేజ్ పంపండి.
మెనూలో 'Education Services' ఆప్షన్ను ఎంచుకోండి.
ఆ తర్వాత 'డౌన్లోడ్ SSC సప్లిమెంటరీ ఫలితాలు' అనే లింక్ పై క్లిక్ చేయాలి.
మీ హాల్ టికెట్ నంబర్ ఇస్తే చాలు. మీ మార్కుల మెమో డిస్ ప్లే అవుతుంది.








కామెంట్లు (0)