ప్రజాశక్తి - శ్రీకాకుళం : తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జూలై 30న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు వెళ్తున్న పలాస మున్సిపల్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టరేట్ కు తరలివస్తున్న మహిళా కార్మికులను కూడా రోడ్డుపై అడ్డగించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ కు వెళ్తున్న కార్మికులను పోలీసుల నిర్బంధాన్ని ప్రజా సంఘాలు ఖండించాయి.








కామెంట్లు (0)