బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

SL vs IND - గాలేలో గెలుపు.. భారత్‌కు కొత్త ఊపు .. !

1 గంట క్రితం

Victory in Galle... fresh momentum for India in the WTC final race!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 04:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

గాలే : గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఎదుర్కోలేక తడబడ్డారు. సోనాల్ డినుషా, ధనంజయ డిసిల్వా కొంతసేపు ప్రతిఘటించినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది.


ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ పరిస్థితి మెరుగుపడింది. మ్యాచ్‌కు ముందు 48.15 శాతంగా ఉన్న పాయింట్ల శాతం ఇప్పుడు 53.55కి చేరింది. దీంతో ఐదో స్థానంలో ఉన్న టీమిండియా నాలుగో స్థానంలోని బంగ్లాదేశ్‌కు మరింత చేరువైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 77.78 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికా 75, న్యూజిలాండ్ 72.22 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ 66.67 శాతంతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

క్రికెట్

ముందున్నది కఠిన సవాల్ ....

తొలి టెస్టులో గెలిచినప్పటికీ భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ అంత తేలికగా దక్కే పరిస్థితి లేదు. ప్రస్తుత సైకిల్‌లో టీమిండియా ఇంకా ఎనిమిది టెస్టులు ఆడాల్సి ఉంది. శ్రీలంకతో మరో టెస్టు, న్యూజిలాండ్‌తో రెండు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఫైనల్ అవకాశాలను బలపరుచుకోవాలంటే ఈ ఎనిమిది మ్యాచ్‌లలో కనీసం ఆరింటిని గెలవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భారత్ కంటే ముందున్న జట్ల ఫలితాలు కూడా కీలకం కానున్నాయి. ప్రత్యర్థి జట్లు పాయింట్లు కోల్పోతే టీమిండియాకు టాప్-4లోకి చేరే అవకాశం మరింత పెరుగుతుంది.


శ్రీలంకకు కష్టాలు .....

గాలేలో ఓటమితో శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలకు గట్టి దెబ్బ తగిలింది. ప్రస్తుతం 33.33 శాతం పాయింట్లతో ఆ జట్టు ఆరో స్థానంలో ఉంది. 60 శాతం స్థాయికి చేరుకోవాలంటే మిగిలిన ఏడు మ్యాచ్‌లలో ఆరింటిని గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌తో మరో టెస్టుతో పాటు న్యూజిలాండ్, పాకిస్తాన్ పర్యటనలు శ్రీలంకకు ఉన్నాయి. అదనంగా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లన్నింటిలో అత్యధిక విజయాలు సాధించడం లంకకు పెద్ద సవాలుగా మారింది.
టేబుల్

గాలే విజయంతో భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో తన అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. శ్రీలంకతో తదుపరి టెస్టులోనూ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే అసలు పరీక్ష న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో జరగనున్న కఠిన సిరీస్‌లే. ఫైనల్ చేరాలంటే ఆ మ్యాచ్‌ల్లో టీమిండియా స్థిరమైన విజయాలు సాధించాల్సి ఉంటుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్