లక్నో : అయోధ్య రామాలయం విరాళాల గల్లంతు కేసులో సిట్ నివేదికను సమర్పించింది. మంగళవారం హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ ప్రసాద్ కార్యాలయంలో సిట్ ప్రాథమిక నివేదికను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది ప్రస్తుతం ప్రాథమిక నివేదిక మాత్రమేనని, మరింత దర్యాప్తు చేపట్టనున్నట్లు పేర్కొన్నాయి. సిట్ విచారణ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు సేకరిస్తోందని వెల్లడించాయి. అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల అవకతవకలపై ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు యోగి ప్రభుత్వం జూన్ 13న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అయోధ్య రామాలయం విరాళాల కేసులో సిట్ నివేదిక
23 జూన్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 23, 2026, 03:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)