విజయవాడ : విజయవాడ ధర్నాచౌక్ వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పొగాకు, మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, కౌలు రైతుల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ... ఎపి రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ధర్నాచౌక్, స్వర్ణపాలెస్ జంక్షన్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. సిఎం ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు రైతులు యత్నించగా.. బారికేడ్లు పెట్టి రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు.
విజయవాడలో ఉద్రిక్తత - రైతుల ఆందోళన అడ్డగింత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 03:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)