ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు జిల్లా) : రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) మాదిరెడ్డి ప్రతాప్ మంగళవారం ఉదయం సైకిల్ పై తెనాలికి చేరారు. ఉద్యోగ విరమణ సందర్భంగా ... పోలీస్ శాఖకు ఆదర్శప్రాయంగా నిలిచిన ఐపిఎస్ అధికారి ఉమేష్ చంద్ర విగ్రహానికి నివాళులర్పించేందుకు తెనాలికి సైకిల్ పై చేరారు. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది ఆయనను ఘనంగా స్వాగతించారు. గతంలో ఆయన ఉమేష్ చంద్ర తో కలిసి పనిచేశారు. ఉద్యోగ విరమణ చివరి రోజున ఉమేష్ చంద్ర విగ్రహానికి నివాళులు అర్పించేందుకు డిజిపి నేరుగా తెనాలికి రావడం పోలీస్ వర్గాలలో చర్చనీయాంశమయ్యింది.
సైకిల్ పై తెనాలికి చేరిన ఎపి డిజిపి ప్రతాప్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)