ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ కి ఆపస్ బృందం మంగళవారం కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. 2010 కి ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు కోసం పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో చట్టసభలో చట్ట సవరణ చేయవలసిందిగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్ కి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం వినతి పత్రాన్ని భోగాపురంలో మోడల్ స్కూల్ లో అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆపస్ జిల్లా అధ్యక్షులు కొవ్వాడ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బల్లా శ్రీనివాసరావు, ఇదిరోతు రాము నాయుడు రాష్ట్ర కార్యదర్శి పాల్గొన్నారు.
కేంద్ర మంత్రికి ఆపస్ ప్రాతినిధ్యం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 04:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్లు (0)