సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏపీలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ

1 గంట క్రితం

ips
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 12:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కూటమి ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాలకు ఓఎస్డీలు , అదనపు ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కాపురం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా నవజ్యోతి మిశ్రా, రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్‌ దేవ్‌ రాజ్‌ను నియమించింది. పోలవరం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా మందా జావలి అల్ఫోన్స్‌, అమరావతి ఓఎస్డీ లాండ్‌ ఆర్డ్‌ర్‌గా మనోజ్‌ రామనాథ్‌ హెగ్డే, పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా రోహిత్‌ కుమార్‌ చౌదరి, నంద్యాల ఏఎస్పీగా సుస్మిత నియమితులయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్