ప్రజాశక్తి - సూళ్లూరుపేట రూరల్ : సూళ్లూరుపేట హైస్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆరోగ్య సంపద అని ఆమె పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళలు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సూళ్లూరుపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 21, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)