మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో నవీన్ పోలిశెట్టి నటించనున్నట్లు తాజాగా వెల్లడైంది. సోషల్ మీడియా వేదికగా నవీన్ ఓ ప్రమోషన్ చేసి ఈ విషయాన్ని తెలిపారు. దీనికి స్పందనగా మైత్రీ మూవీ మేకర్స్ కూడా నవీన్ను తమ ప్రొడక్షన్ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ.. ఒక ఫుల్-ఆన్ ఎంటర్టైనర్ లోడింగ్ అవుతోందని వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ను పూర్తి స్థాయి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు. ‘సైరన్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు ఆంటోనీ భాగ్యరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
మైత్రీతో నవీన్ పోలిశెట్టి
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 09:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)