- ట్రంప్ వద్ద రష్యా ఆంక్షల బిల్లు
- భారత్పై 100% సుంకాల ముప్పు
వాషింగ్టన్: రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకునే భారత్ సహా పలు దేశాలపై ఆర్థిక ఆంక్షలకు అమెరికా సన్నాహాలు చేస్తోంది. ఈ దేశాలపై 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అధికారాన్ని కల్పించే రష్యా ఆంక్షల బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించింది. బుధవారం జరిగిన ఓటింగ్లో ఈ బిల్లును 262–159 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ బిల్లుకు 'లిండ్సే ఓ'గ్రాహం రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టం 2026' అని పేరు పెట్టారు. గత ఆగస్టులో సెనేట్ ఈ బిల్లును భారీ మెజారిటీతో ఆమోదించింది. ట్రంప్ దీనిపై సంతకం చేయగానే ఇది చట్టంగా మారుతుంది. ఈ కొత్త బిల్లు భారత్తో సహా పలు దేశాల సార్వభౌమాధికారం, స్వేచ్ఛా వాణిజ్య విధానాలపై దాడిగా పరిగణించబడుతుంది.
తన సామ్రాజ్యవాద ఎజెండాలో భాగంగా రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లను కొనసాగిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా ఇంధన ఆదాయాలకు దెబ్బతీయడం అమెరికా లక్ష్యంగా ఉంది. భారత్, చైనాతో పాటు స్లోవేకియా, హంగేరి, అజర్బైజాన్లు కూడా ఈ కొత్త సుంకం వల్ల ముప్పును ఎదుర్కొంటాయి. అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతుండగా, భారతదేశంపై సుంకాల ముప్పు మళ్లీ వ్యక్తమవుతోంది.







కామెంట్లు (0)