శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ ఘనవిజయం

5 గంటల క్రితం

cini
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 08:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- అధ్యక్షునిగా మూడో సారి కొయ్యలమూడి రాకేష్‌.

మా వర్కర్‌ చనిపోతే తక్షణమే లక్ష ఆర్థికసాయం: తెలుగు టెలివిజన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు కొయ్యలమూడి రాకేష్‌ (నాని)

శ్రీ కృస్ణానగర్‌లోని టీవి ఫెడరేషన్‌ కార్యలయంలో తెలుగు టెలివిజన్‌ డిజిటల్‌ అండ్‌ ఓటిటి టెక్నిషియన్స్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌కి జరిగిన ఎన్నికలలో శ్రామిక ప్యానల్‌ నుండి పోటీ చేసిన 20 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా ప్రెసిడెంట్‌ మరియు జనరల్‌ సెక్రటరీ పోస్టులకు జరిగిన ఎన్నికల్లో శ్రామిక ప్యానల్‌ నుండి అధ్యక్షునిగా పోటీచేసిన కొయ్యలమూడి రాకేష్‌ (నాని) ప్రధాన కార్యదర్శిగా పుట్టా విజయ్‌కుమార్‌లు 95 శాతం ఓట్లు సాధించి ఘన విజయాన్ని అందుకున్నారు. తెలుగు టెలివిజన్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి అధ్యక్షునిగా విజయం సాధించారు రాకేష్‌ నాని అండ్‌ టీమ్‌. ఎలక్షన్‌ ఫలితాల్లో విజయం సాధించిన తర్వాత ఫెడరేషన్‌ అధ్యక్షుడు నాని మాట్లాడుతూ–‘‘ 24 శాఖల్లో ఉన్న వర్కర్స్‌ ఫెడరేషన్‌లో దాదాపు 7000 మంది సభ్యులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఎలక్షన్‌లో పోటీ చేసినప్పుడు మా అందరిది ఒకే ఎజెండా. మా 7000 మంది సభ్యుల్లో దురదృష్టవశాత్తు ఎవరైనా మరణిస్తే వారికి తక్షణం గంటలోపే లక్ష రూపాయల తక్షణ ఆర్థిక సాయాన్ని అందిస్తాం అని అన్నారు నాని. ఈ ఎన్నికలు టీవి అడహక్‌ కమిటీ చైర్మెన్‌ పి.మురళీ వైస్‌ చైర్మన్‌ బి.మోహన్‌రాజుల ఆధ్వర్యంలో జరుగగా హైకోర్టు అడ్వకేట్‌ కె.వి.ఎల్‌ నరసింహారావు గారు చీఫ్‌ ఎలక్షన్‌ ఆఫీసర్‌గా వ్యవహరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్