ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్పై అఫ్రోజ్ షేక్ నిర్మిస్తున్న పాన్ఇండియా చిత్రం ‘మొహబ్బత్’. సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు కలాం అందిస్తున్నారు. మ్యాక్ దర్శకత్వం వహిస్తున్నారు. రాఖీ పండుగ సందర్భంగా చిత్ర బృందం తాజాగా సోల్ఫుల్ పోస్టర్ను విడుదల చేసింది. ఎమోషనల్ యూత్ఫుల్ లవ్స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆకట్టుకున్నాయి. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా, వైఎస్ కృష్ణ ఛాయాగ్రహణం చేస్తున్నారు.
‘మొహబ్బత్’ నుంచి పోస్టర్ విడుదల
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 28, 2026, 06:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)