బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేపాల్‌లో వరుసగా రెండు భూకంపాలు

1 గంట క్రితం

nepal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 01:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కాఠ్మాండు: వాయువ్య నేపాల్‌లో బుధవారం తెల్లవారుజామున వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం అందలేదు. జాతీయ భూకంప పరిశోధన కేంద్రం ప్రకారం.. ముగు జిల్లాలోని కలై ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని మొదటి భూకంపం తెల్లవారుజామున 1:51 గంటలకు సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. అదే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని రెండో భూకంపం తెల్లవారుజామున 4:28 గంటలకు సంభవించింది. దీని తీవ్రత 4.2గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రకంపనలు పొరుగున ఉన్న డోల్పా, జుమ్లా జిల్లాల్లోనూ అనుభూతి చెందారు. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. భూకంపాలు తరచుగా సంభవించే ప్రాంతంలో నేపాల్ ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ఎక్కడైనా ప్రకంపనలు లేదా భవనాలకు నష్టం జరిగిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్