ప్రజాశక్తి-సూళ్లూరుపేట రూరల్ (తిరుపతి) : అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రోలోని అత్యంత కీలక కేంద్రాల్లో ఒకటైన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, వీఎస్ఎస్సీకి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ యు.పి. రాజీవ్ ను కొత్త డైరెక్టర్ గా నియమించింది. ప్రస్తుతం వీఎస్ఎస్సీలో అసోసియేట్ డైరెక్టర్, పరిశోధన, అభివృద్ధి విభాగంలో సేవలందిస్తున్న ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశ ప్రయోగ వాహనాల అభివృద్ధిలో కీలక బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ రాజీవ్ ను రాకెట్ నియంత్రణ వ్యవస్థలు, గైడెన్స్ టెక్నాలజీ రంగాల్లో దశాబ్దాల అనుభవం ఉంది. ఇస్రో చేపట్టిన పలు ప్రధాన ప్రయోగ వాహన కార్యక్రమాల్లో మిషన్ డిజైన్, సిమ్యులేషన్ ప్రక్రియలకు ఆయన విశేష నాయకత్వం వహించారు. కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా పతనాపురం స్వస్థలమైన డాక్టర్ రాజీవ్, తిరువనంతపురం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఇంజినీరింగ్ పట్టా, ఎన్ఐటీ కాలికట్లో ఇన్ స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ పీజీ, అనంతరం భారతీయ విజ్ఞాన సంస్థ, ఐఐఎస్సీ బెంగళూరులో పీహెచీ పూర్తి చేసి ఇస్రోలో శాస్త్రవేత్తగా తన సేవలను కొనసాగించారు. భారత అంతరిక్ష ప్రయోగ వాహనాల రూపకల్పన, సాంకేతిక అభివృద్ధికి విశేషంగా దోహదపడిన ఆయనకు వీఎస్ఎస్సీ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించడం ఇస్రోలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. ఆయన నాయకత్వంలో భారత అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు, ప్రయోగ వాహనాల సాంకేతిక సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందనే ఆశాభావాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు.
శ్రీహరికోట వి ఎస్ ఎస్ పి కి కొత్త డైరెక్టర్ గా సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ యు పి రాజీవ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 04:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)