mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ విడుదల తేదీ ఖరారు

1 గంట క్రితం

Release date confirmed for ‘Adarsha Kutumbam House No. 47’
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 04:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అక్టోబర్ 2న వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల


హైదరాబాద్ : తెలుగు సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ ఎట్టకేలకు వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తోన్న కుటుంబ కథా చిత్రం “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 – AK47” విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.


ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ పోస్టర్ సినిమాలోని హృద్యమైన, ఉత్సాహభరితమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. ఇందులో వెంకటేష్, శ్రీనిధి శెట్టి ఎంతో హుందాగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఆత్మీయ కుటుంబ కథకు అద్దం పట్టేలా ఉన్నారు. ఈ చిత్రం భావోద్వేగాలు, వినోదం, హృదయాన్ని హత్తుకునే క్షణాలతో నిండిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని పోస్టర్ స్పష్టం చేస్తోంది.


వెంకటేష్, త్రివిక్రమ్‌ కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ శైలిలో మనసును హత్తుకునే భావోద్వేగాలు, గుర్తుండిపోయే పాత్రలు, కట్టిపడేసే హాస్యం, అర్థవంతమైన కథనం కలగలిపి, ప్రేక్షకులకు సంపూర్ణమైన సినిమా అనుభూతిని అందించడానికి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47’ సిద్ధమవుతోంది. తన సహజమైన ఆకర్షణ, అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించే వెంకటేష్.. ఈసారి కూడా కుటుంబ విలువలతో కూడిన పాత్రలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనున్నారు.


ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, కెవిన్ కుమార్ యాక్షన్ సన్నివేశాల కొరియోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన కలయికలో ఒకటైన వెంకటేష్–త్రివిక్రమ్ కాంబో మరోసారి కలిసి వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.


అక్టోబర్ 2, 2026న పండుగ సీజన్‌లో విడుదల కానున్న "ఆదర్శ కుటుంబం హౌస్ నం: 47" చిత్రం, ఒక పరిపూర్ణ కుటుంబ వినోదభరిత చిత్రంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. వెంకటేష్‌ ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెన్స్, త్రివిక్రమ్ అద్భుతమైన కథాకథనం కలయికతో ఆవిష్కృతమయ్యే మ్యాజిక్‌ను చూడటానికి అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్