- 17 కిలోల హెరాయిన్ను స్వాధీనం
చండీగఢ్: అమృత్సర్లోని పంజాబ్ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ సరిహద్దు డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను ఛేదించింది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. 17 కిలోల హెరాయిన్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ప్రకటించారు. ప్రాథమిక విచారణలో నిందితులు సరిహద్దు అవతల ఉన్న స్మగ్లర్లతో కలిసి పనిచేస్తూ, వారి నుండి హెరాయిన్ను సేకరించి పంపిణీ చేస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఘటనపై అమృత్సర్లోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.






కామెంట్లు (0)